చిత్రం న్యూస్, సాత్నాల: గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని సాత్నాల ఎంపీడీవో వెంకట్ రాజు, తహసీల్దార్ జాదవ్ రామారావు అన్నారు. మండలంలోని కాన్ప మేడిగూడ (ఆర్) గ్రామంలోని రైతువేదికలో గురువారం సమావేశం ఏర్పాటు చేసి సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఆ దిశగా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో రాథోడ్ కైలాష్, ఏపీఎం సుజాత తదితరులు పాల్గొన్నారు.

