చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్ లోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఈ నెల 18న చలో ఖమ్మం వాల్ పోస్టర్లను సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వతంత్రంలో కీలక పాత్ర పోషించిన సీపీఐ పార్టీ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో ఈనెల 18న మధ్యాహ్నం రెండు గంటలకు భారీ ర్యాలీ ఉంటుందని,మూడు గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ సభకు అదిలాబాద్ జిల్లా నుండి వేలాదిగా తరలిరావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ 100 సంవత్సరాలు పోరాటంలో దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమికొట్టటానికి సీపీఐ పోరాటం కీలకమని, ఆ పోరాటంలో అనేక అక్రమ కేసులు పెట్టి మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు పెషావర్ కుట్ర కేసులు పెట్టి అణిచివేయడం జరిగిందని, కొన్ని సందర్భాలలో సీపీఐ పార్టీని బ్రిటిష్ వారు బ్యాన్ పెట్టడం జరిగిందన్నారు.

