Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

AYYAPPA SWAMI: అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన షేక్ అలీ

చిత్రం న్యూస్, బోథ్ : మతసామరస్యానికి మన దేశంలో కొదవలేదు. ప్రపంచంలోనే మన దేశం సమైక్యతకు ప్రాతిక ప్రతిరూపంగా నిలుస్తుంది. అన్ని పండుగలను కుల మతాలకతీతంగా సామరస్య పూర్వకంగా కలిసిమెలిసి జరుపుకుంటారు. ఈ క్రమంలోనే బోథ్ మండలంలోని దన్నూరు (బి) గ్రామానికి చెందిన షేక్ అలీ గురువారం అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసి తన భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ఎంత పవిత్రంగా కఠోర ఉపవాసాలతో జరుపుకుంటాము అలాగే అయ్యప్ప స్వాములు నెల రోజులపాటు కఠిన నియమాలతో అంతే గొప్పగా స్వామి పై తన భక్తిని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఎటువంటి భేదభావ్యం లేకుండా అన్ని పండుగలను కుల మతాలకతీతంగా ఐక్యమత్యంతో కలిసి జరుపుకోవాలని తెలిపారు. ముఖ్యంగా అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం తనకు ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఆ స్వామి ఆశీస్సులతో సమాజం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.  గత ఆరు సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి బద్దం రమణారెడ్డి, అరుణ్ రెడ్డి, సందీప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, విజయ్ రెడ్డి, జైపాల్ రెడ్డి,అమరేందర్ రెడ్డి, సంతోష్, రమేష్, భోజన్న, స్నేహిత్ రెడ్డి పురుషోత్తం, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments