Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

కలెక్టర్ రాజర్షి షాకు TGO, TNGO సంఘాల అభినందనల వెల్లువ

చిత్రం న్యూస్: ఆదిలాబాద్: ఆదిలాబాద్  జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు టీఎన్జీవో యూనియన్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో అభినందనలు వెల్లువెత్తాయి. జల సంరక్షణ, నీటి వనరుల సద్వినియోగం’ అంశంలో ఆదిలాబాద్ జిల్లాను జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షాను గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు. మెమొంటో, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ..కింది స్థాయి ఉద్యోగుల కృషి వల్లే మన జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు.

జిల్లా గజిటెడ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు కే.శివకుమార్, టీఎన్జీఓ జిల్లా సెక్రటరీ ఎ.నవీన్ కుమార్ మాట్లాడుతూ.. కలెక్టర్ కు జిల్లా స్థాయిలో లభించిన గుర్తింపుతో జిల్లా ఉద్యోగులందరూ మరింత స్ఫూర్తితో జిల్లా ప్రజలకి సేవలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో TGO యూనియన్ జిల్లా సెక్రటరీ రామారావు రాథోడ్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు సంద అశోక్ , టీఎన్జీవో నాయకులు తిరుమల్ రెడ్డి ,గోపి, చంద్ర మోహన్ రెడ్డి, రాజేశ్వర్, నారాయణ, రవి , అసురీ ప్రవీణ్, కె.అరుణ్ కుమార్, సోహైల్, సంజయ్ ,TGO భాద్యులు రాజేష్ , శ్రీనివాస్, అనిల్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, భగత్ రమేష్, రమణ చారి , వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షులు నర్సింలు , ఓం ప్రసాద్, సుజాత, రాధ , ప్రభుత్వ డ్రైవర్స్ సంఘం అధ్యక్షులు సఫ్దర్ అలీ , వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments