లోకమాన్య గణేష్ మండలి వద్ద వినాయకునికి 25 రకాల నైవేద్యం
చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ మండలంలోని లోకమాన్య గణేష్ మండలి వద్ద కాలనీవాసులు అందరూ కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి 25 రకాల నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆడపడుచులు అందరూ కలిసి ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. మరియు గోరింటాకు పెట్టుకున్నారు. బోథ్ మండలంలోని పోచమ్మ కాలనీలో గణపతి వద్ద కుంకుమ పూజ చేశారు. మహిళలందరూ కలిసి గాజులు వేసుకున్నారు. పూజా కార్యక్రమాలతో మండలి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

