ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి సూచికగా గ్రామ గ్రామాన తిరంగా ర్యాలీ
*హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రపంచ దేశాలకు మన భారత దేశం నాయకత్వం వహించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పయనిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి సూచికగా గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో తిరంగా ర్యాలీ జరుపుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, విద్యార్థులు పట్టణ ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే జాతీయ జెండాను చేత పట్టుకొని పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తి చాటేలా విద్యార్తులు దేశభక్తి నినాదాలతో హోరెత్తించారు.
అనంతరం అంబేద్కర్ చౌక్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రపంచానికి భారతదేశ సైనిక శక్తి సామర్థ్యాన్ని చెప్పడం జరిగిందన్నారు. 15 నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని పలు స్తావరాలను నేలమట్టం చేసిన గొప్ప శక్తి గల సైన్యం మనది అన్నారు. పక్కనున్న ఉగ్ర దేశం పాకిస్తాన్ మాట్లాడిన మాటలకు, చేష్టలకు నిమిషాల వ్యవధిలోనే మన దేశం సమాధానం చెప్పడం జరిగిందన్నారు. బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

