Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

యూనివర్సిటీ సాధనపై విద్యార్థులతో చర్చా కార్యక్రమం 

యూనివర్సిటీ సాధనపై విద్యార్థులతో చర్చా కార్యక్రమం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:యూనివర్సిటీ సాధన సమితి ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో యూనివర్సిటి ఏర్పాటుకోసం విద్యార్థులతో చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా NHRC జిల్లా  చైర్మన్ బద్దం పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ..ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేకపోవడం వలన విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. పలువురు విద్యార్థులు చదువును మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి సైతం ఏర్పడుతోందన్నారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు జరిగితే నాణ్యమైన విద్య అందించబడటమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు ముందుకు వచ్చి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కోకన్వీనర్ తొగరి భాస్కర్ , కళాశాల ప్రిన్సిపల్ హనుమాండ్లు, దీపక్ ,అరవింద్, విద్యార్థిని, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments