రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
చిత్రం న్యూస్,పెద్దాపురం: కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ చేసింది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో రైతులు వారి ఆనందాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా రైతులందరూ కలిసి ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె మంగ లక్ష్మి రామారావు , నియోజకవర్గ అబ్జర్వర్ బోళ్ల వెంకటరమణ ,యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, సామర్లకోట మండలం టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు, పెద్దాపురం మండలం అధ్యక్షులు మొగుళ్ళ కృష్ణమూర్తి, సామర్లకోట పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్, పాలకుర్తి శీను బాబు, మాజీ జడ్పీటీసీ రామకృష్ణ కంటే బాబు, పెద్దాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-