Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన

సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల గురించి హెల్త్ అసిస్టెంట్లు రాథోడ్ కైలాష్, సుభాష్ కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని, దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని అన్నారు. దోమ పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి, దోమల నివారణ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు పద్మ, సుధారాణి, కాలనీవాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments