ఉచిత వైద్య శిబిరానికి రావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు ఆహ్వానం
చిత్రం న్యూస్ బోథ్: బోథ్ మండల కేంద్రంలోని లోకమాన్య నగర్ లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి హాజరు కావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను లోకమాన్య యూత్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. బాలగంగాధర్ తిలక్ 169 వ జయంతి సందర్భంగా ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు వేణు, విష్ణు, సంతోష్, రాంసాగర్, కిరణ్, విజయ్, కుశల్ రెడ్డి. శశికాంత్, వినయ్ తదితరులు ఉన్నారు.

