దేశీదారు అమ్మిన వారిపై కఠిన చర్యలు
చిత్రం న్యూస్, సొనాల: దేశీదారు అమ్మిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జుల్ఫీకర్ అహ్మద్ అన్నారు. మండలంలోని గుట్టపక్క తండ గ్రామానికి చెందిన మట్ట చందర్ సింగ్ మహారాష్ట్రకు చెందిన దేశీధారు కేసులో పలుమార్లు పట్టుబడితే తహసీల్దార్ దగ్గర బైండోవర్ చేయించడం జరిగిందన్నారు. మళ్ళీ దేశీదారు అమ్ముతూ పట్టుపడ్డాడన్నాడు. బైండోవర్ ఉల్లంఘించినందుకు రూ.50 వేల జరిమానా విధించడం జరిగిందన్నారు. మంగళవారం మట్ట చందర్ సింగ్ రూ.50 వేలు చాలన్ కట్టించినట్టు ఆయన తెలిపారు. ఎవరైనా దేశీదారు, గుడుంబా కఅమ్మినా, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంతామన్నారు. పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ జూల్ఫీకర్ అహ్మద్ హెచ్చరించారు.

