బస్సు డ్రైవర్ కు ప్రసాదం అందజేస్తున్న ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారిణి కే. విజయలక్ష్మి
చిత్రం న్యూస్, పెద్దాపురం: మొట్ట మొదటి సారిగా మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తుల సౌకర్యం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ స్పెషల్ బస్సలను ఏర్పాటు చేసింది. బుధవారం తుని బస్ డిపో నుండి పెద్దాపురం మరిడమ్మ ఆలయానికి భక్తులతో స్పెషల్ బస్ వచ్చింది. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణ అధికారిణి కే. విజయలక్ష్మి బస్సు డ్రైవర్ కి ప్రసాదం, భక్తులకు శ్రీ అమ్మవారి ఫోటోలను అందజేశారు. ఇతర సిబ్బంది పాల్గొన్నారు