పెద్దాపురంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బీజేపీ నాయకులు
చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో డా.శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా పెద్దాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం అభియాన్ ప్రముఖ్ గోరకపూడి చిన్నయ్య దొర ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గా మోహనరావు, పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్నయ దొర మాట్లాడుతూ ..శ్యామ ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు కోసం ఉద్యమం నడిపారన్నారు. ఆయన “ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిశాన్, దో ప్రధాన్ నహీ చలేగా” అనే నినాదంతో కాశ్మీర్ను పూర్తిగా భారతదేశంలో విలీనం చేయాలని కోరారాన్నారు. 1953లో కాశ్మీర్లో అనుమతి లేకుండా ప్రవేశించినందుకు ఆయనను అరెస్టు చేశారన్నారు. జూన్ 23, 1953న శ్రీనగర్ జైలులో ఆయన మరణించారన్నారు. అధికారికంగా గుండెపోటు కారణంగా మరణించినట్లు చెప్పబడినప్పటికీ, ఆయన మరణం చుట్టూ అనేక అనుమానాలు, వివాదాలు ఉన్నాయని కొందరు ఆయన మరణాన్ని హత్యగా భావిస్తారని, ఈ అంశం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉందని అన్నారు. ఈ రోజు భారతీయ జనసంఘ్ (ప్రస్తుత BJP), ఇతర సంస్థలు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జాతీయవాద ఆలోచనలను, కాశ్మీర్ ఏకీకరణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరిస్తారన్నారు. దేశవ్యాప్తంగా సభలు, స్మారక కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించబడతాయని, ఆయన త్యాగం హిందూ జాతీయవాద భావజాలానికి, భారత ఏకత్వానికి ప్రేరణగా గుర్తించబడుతుందన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు, ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు, 2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఆయన కల నెరవేరినట్లుగా భావించబడిందదని. పేర్కొన్నారు. ఆయన బలిదాన్ దివస్ భారతదేశంలో జాతీయవాద భావనలను బలోపేతం చేయడానికి ఒక సందర్భంగా గుర్తించబడిందని ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామ్ కుమార్, దుర్గ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.