సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్
చిత్రం న్యూస్,శంకరపట్నం :సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆపదలో ఉన్న పేదలకు లబ్ధి చేకూరుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం రోజున హుజురాబాద్ పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు, రెండు పట్టణాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. హుజురాబాద్ మండలం -31, హుజురాబాద్ పట్టణం -18, జమ్మికుంట మండలం-22, జమ్మికుంట పట్టణం13, వీణవంక-39, ఇల్లందుకుంట -21, కమలాపూర్-54 పట్టణ మండలాలకు సంబంధించిన మొత్తం 198 మంది లబ్ధిదారులకు 75,67,000 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ క్కులను అందజేశారు.