జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాతుతున్న బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, నేతలు
చిత్రం న్యూస్, జైనథ్: శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, నేతలతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, భోరజ్ మండల అధ్యక్షులు గాజుల సన్నీ, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎల్టి అశోక్ రెడ్డి, జైనథ్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నారకట్ల ప్రతాప్ యాదవ్, దళిత మోర్చ జైనథ్ మండల అధ్యక్షుడు గొడుగుల సత్యనారాయణ, ఏనుగు సూర్య రెడ్డి, పొచ్చన్న, గంగన్న మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.