మరాఠీ వడ్రంగి సంఘం నూతన కమిటీ ఎన్నిక
*అధ్యక్షులుగా లాండే విలాస్ , ప్రధాన కార్యదర్శిగా కాయర్కర్ ప్రమోద్
చిత్రం న్యూస్, తాంసి: మరాఠీ వడ్రంగి సంఘం తాంసి, భీంపూర్ మండలాల ను కలిపి ఒక సంఘంగా ఎన్నుకున్నారు.. ఆదివారం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాన్వె సంతోష్ ఎం. దిలీప్ సమక్షంలో నూతన కమిటీని ఏకగ్రీవం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా లాండే విలాస్ , ప్రధాన కార్యదర్శిగా కాయర్కర్ ప్రమోద్ ,గౌరవ అధ్యక్షులుగా లాండే శంకర్ , ఉపాధ్యక్షులుగా గౌకర్ విలాస్, కోశాధికారిగా రాము, సలహాదారులుగా సంతోష్, రాజు, ఆకాష్ లను ఎన్నుకున్నారు.