కూచిపూడి పోటీల్లో హుజురాబాద్ చిన్నారి నిర్విరెడ్డికి ప్రథమ స్థానం
*అభినందించిన కరీంనగర్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి
చిత్రం న్యూ స్, శంకరపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల కళా సమ్మేళన్ 2025లో హుజురాబాద్ పట్టణానికి చెందిన వై.వినోద-మహేందర్ రెడ్డి దంపతుల కుమార్తె వై.నిర్విరెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజెపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, హుజురాబాద్ రూరల్ బీజెపీ నాయకులు చిదిరాల శ్రీనివాస్ రెడ్డి- రాణి దంపతులు వై.నిర్విరెడ్డిని కలిసి అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నిర్విరెడ్డి విజయం హుజురాబాద్ కు గర్వకారణమని తెలిపారు.