మరాఠీ వడ్రంగి సంఘం అధ్యక్షుడిగా హనుమాండ్లు
చిత్రం న్యూస్, జైనథ్: మరాఠీ వడ్రంగి సంఘం జైనథ్ మండల అధ్యక్షుడిగా గౌకర్ హనుమాండ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఆదివారం మండల కేంద్రంలో కమిటీని ఎన్నుకున్నారు.. ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కాయర్కర్, గౌరవ అధ్యక్షులుగా తానుబ, ఉపాధ్యక్షులుగా శాస్త్రకార్ విట్టల్, వామన్ గౌకర్, కార్యదర్శులు గా చందు, గంభీర్, రాంకిషన్ ఎన్నికయ్యారు.. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, దిలీప్, నాయకుడు వెంకట్, నాగోరావ్, ప్రమోద్, గోవర్ధన్, సుధీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.