వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత
*సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: వృద్ధులను గౌరవించడంతోపాటు వారిని ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని జిల్లా వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు దేవిదాస్ దేశ్ పాండే, లక్ష్మారెడ్డి, నరసింహులు, పోశెట్టి, హనుమంత్ రెడ్డి, శంకర్, గంగాధర్ తదితరులు ఉన్నారు.