తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప
చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 తో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పెద్దాపురం పార్టీ కార్యాలయంలో,నాయకులు ,కార్యకర్తలతో కలిసి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ..ఎంతో సంతోషంగా ఉందని ఆన్నారు. సంవత్సరం కాలంలో ఎన్నో అభివృధి కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.