అమరుల త్యాగాలు మరువలేనివి
చిత్రం న్యూస్, శంకరపట్నం :
శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేని అన్నారు.