పేద ప్రజల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
*సాంగిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
*హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు
చిత్రం న్యూస్, బేల:
గూడు లేని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చి వారి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఇల్లు లేని పేద ప్రజలను గుర్తించి ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి 35 ఇళ్ల నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ప్రత్యేక అధికారి ,ఏ ఈ వినోద్ తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌతమ్, ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి లతో పాటు గ్రామస్తులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిరుపేద సరైన ఇల్లు లేనటువంటి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఆధ్వర్యంలో 35 ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి భూమి పూజచేశారు . అనంతరం సామ రుపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గడచిన పదేళ్లలో బి.ఆర్.ఎస్.ప్రభుత్వం లో ఏళ్లుగా ఎదురుచూసిన అర్హులై ఉన్నప్పటికీ ఇల్లు కట్టించి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళుతున్న ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. ఇంకా గ్రామంలో అర్హులైన ప్రతివారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యే విధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తమ వంతు కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సామనర్సారెడ్డి, దయాకర్ పటేల్, లస్మన్న, వినోద్,సుధాకర్, మంచికంటి నవనీత్, మంచికంటి సాయి, తదితరులు ఉన్నారు.