తరోడ వాగులో గల్లంతైన దత్తు మృతదేహం లభ్యం
చిత్రం న్యూస్, భోరజ్: జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు భోరజ్ మండలం తరోడ వాగులో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బైక్ పై వెళ్తుండగా వాగు ఉధృతికి గల్లంతయిన విషయం విధితమే… పోలీసులు జాలర్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం పూసాయి వాగులో మృతదేహం లభ్యమయ్యింది. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.