- ఉప్పొంగిన అభిమానం…
![]()
![]()
![]()
*మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన….*
75 మంది స్వచ్ఛంద రక్తదానం…
చిత్రం న్యూస్, ఆదిలాబాద్;
యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బేల మండల కేంద్ర ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.స్థానిక A N ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన శిబిరానికి మండలంలోని అభిమానులు పార్టీ కార్యకర్తలు యువకులు ఉప్పెనెల తరలివచ్చి రక్తదానం చేశారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 75 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ ఆడే గజేందర్,కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క,కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ హాజరై కేక్ కట్ చేసి సామ రూపేష్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని పరిశీలించి రూపేష్ రెడ్డిని అభినందించారు. పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ యువతరం నాయకుడు,ప్రజల మనసులు గెలుచుకున్న జన హృదయ నేత యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులుసామ రూపేష్ రెడ్డికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనుక్షణం ప్రజల కష్ట సుఖల్లో ఉంటూ పేదలకు అత్యవసర సమయంలో ఒక అంబులెన్స్ ల పని చేస్తూ మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తున్నందుకు మండల ప్రజలు అభినందనలు తెలిపారు. బేల మండలంలో గిరిజనులకు ఆరోగ్య పరంగా మరిన్ని సేవలు చేయాలనీ కోరారు. భవిష్యత్తులో మీ నాయకత్వంలో బేల మండలం కాంగ్రెస్ పార్టీ మంరింత అభివృద్ధి చెందాలని కోరుతూ మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.
పాల్గొన్న కాంగ్రెస్ నేతలు….
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్,మాజీ జెడ్పిటిసి రాందాస్ నాక్లె,జైనథ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వంకడే,బేల మాజీ ఎంపీపీ బాపురావు హుల్కే,మాజీ ఎంపిటిసి లు సుదర్శన్,నగేష్ రెడ్డి,శంకర్,కిసాన్ కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు గాన్ శ్యామ్,యువజన కాంగ్రెస్ బేల మండల అధ్యక్షుడు అవినాష్,జైనథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మడవి చంద్రకాంత్,శంకర్,అఖిల్,వినోద్,మేకల జితేందర్,అభిమానులు పాల్గొన్నారు.