విశ్వశాంతి విద్యార్థుల అ ‘పూర్వ‘ సమ్మేళనం
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పదేళ్ల పాటు కలిసి చదువుకున్న వాళ్లంతా పదో తరగతి పూర్తికాగానే ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. 23 ఏళ్ల తర్వాత వారంతా ఆదివారం ఒకే చోట కలిసి సందడి చేశారు. ఇలాంటి అ ‘పూర్వ’ ఘట్టానికి ఆదిలాబాద్ పట్టణం వినాయక్ చౌక్ లోని హరివిల్లు ఈవెంట్స్ స్పేస్ వేదిక అయింది. విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో 2003-04 సంవత్సరం పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, గురువుల సన్మాన మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థిగా వెళ్లిపోయిన వారు తమ జ్ఞాపకాలకు గుర్తుగా తరలివచ్చారు. పాఠాలు చెప్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఒక్కచోట కలవడంతో సంతోషపడ్డారు. తమ మధురానుభూతులను పంచుకున్నారు. ఒకరినొకరు కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.

