-Advertisement-

రైతులకు అండగా బీఆర్ఎస్ నాయకులు – మార్కెట్ గోదాముల్లో జొన్నల నిల్వకు అనుమతి

రైతులకు అండగా బీఆర్ఎస్ నాయకులు – మార్కెట్ గోదాముల్లో జొన్నల నిల్వకు అనుమతి

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మార్కెట్ యార్డులో జొన్న రైతుల ఇబ్బందులను గమనించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్శన్ లింగారెడ్డి, మాజీ ఎంపీపీ మార్చెట్టీ గోవర్ధన్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తక్షణమే స్పందించి రైతులకు భరోసా కల్పించారు. మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన జొన్నలు అకాల వర్షం కారణంగా తడిసిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని గమనించిన నాయకులు రంగంలోకి దిగారు.వెంటనే మార్కెట్ అధికారులతో పాటు జిల్లా మార్కెటింగ్ అధికారి (DM) తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. వర్షం వల్ల పంట నష్టం జరగకుండా ఉండేందుకు మార్కెట్ ప్రాంగణంలోని ఖాళీ గోదాముల్లో జొన్నలను నిల్వ చేసేందుకు అనుమతి కోరారు. సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే గోదాముల్లో పంటను భద్రపరిచేందుకు అనుమతినిచ్చారు. దీంతో తడిసిపోతున్న పంటను సురక్షితంగా గోదాములకు తరలించి నిల్వ చేశారు. ఆపద సమయంలో స్పందించి తమ పంటను కాపాడినందుకు రైతులు బీఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. .బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ఆరుగాలం శ్రమించి పండించిన పంట రోడ్డుపాలవుతోందని విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి కొనుగోళ్లు జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. వారి వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డి పురుషోత్తం రెడ్డి, సుభాష్ యాదవ్, స్వామి యాదవ్, రైతులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments