-Advertisement-

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు 

ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు 

చిత్రం న్యూస్, బేల:  ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో రైతు వేదికలో నేల ఆరోగ్యం, పరిరక్షణ, మట్టి నమూనాల సేకరణ, మట్టి పరీక్ష , వివిధ పంటలలో సరైన మోతాదులో ఎరువుల వాడకం వంటి అంశాలపై వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్ కుమార్ సోమవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతుల నుంచి మట్టి నమూనాలు  సేకరించారు. ల్యాబులో పరీక్షించిన మట్టినమునాల ఫలితాలను సూచించే సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందించారు. కార్యక్రమంలో సాంగిడి సర్పంచ్ భూపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బాలచందర్, రైతులు మహేందర్, నితిన్, ఆకాష్, ఆశన్న, శ్రీనివాస్, సాయి , రణధీర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments