-Advertisement-

శిశు గృహలో అదనపు భవనాన్ని పర్యవేక్షించిన కలెక్టర్ రాజర్షి షా.. చిన్నారులకు క్రీడా వస్తువుల పంపిణీ

శిశు గృహలో అదనపు భవనాన్ని పర్యవేక్షించిన కలెక్టర్ రాజర్షి షా.. చిన్నారులకు క్రీడా వస్తువుల పంపిణీ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని శిశు గృహలో నూతనంగా ప్రారంభించిన అదనపు భవనాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా భవనంలోని వసతులను పరిశీలించడమే కాకుండా, చిన్నారుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీశారు.అనంతరం శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని, వారికి అందుతున్న వ్యక్తిగత సంరక్షణ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా బాలలకు క్రీడా వస్తువులను పంపిణీ చేశారు. చిన్నారులకు నిరంతరం సేవలందిస్తున్న సిబ్బందిని అభినందిస్తూ వారిని శాలువాతో సత్కరించి, నూతన వస్త్రాలను, మెమెంటోలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, బాలల సంరక్షణ అధికారి స్వామి, లీగల్ కం ప్రొబేషన్ ఆఫీసర్ కుట్ల రమేష్, మేనేజర్ విజయలక్ష్మి, సోషల్ వర్కర్ స్వప్న, ఏఎన్ఎం, ఆయాలు, డీసీపీయూ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments