రాంపూర్ (టి)లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా
చిత్రం న్యూస్, భోరజ్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భోరజ్ మండలం రాంపూర్ (టి) గ్రామంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా హాజరై, లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఈ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, హౌసింగ్ నోడల్ అధికారి శంకర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, తహసీల్దార్ రాజేశ్వరి, సర్పంచ్ వెంకటమ్మతో పాటు లబ్ధిదారులు, గ్రామస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




