కార్తికేయ సీడ్ షాప్ రెండో బ్రాంచ్ ప్రారంభం: అతిథులుగా కాంగ్రెస్ నాయకులు
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కార్తికేయ సీడ్ షాప్ రెండవ బ్రాంచ్ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. షాప్ యజమాని లక్ష్మణ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు, కంది శ్రీనివాస్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీ జైనథ్ మండల సోషల్ మీడియా కన్వీనర్ పుండ్రు నరేష్ రెడ్డి, రిమ్స్ కో-ఆర్డినేటర్ ఎల్మ రాంరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులను యజమాని లక్ష్మణ్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంలో కార్తికేయ సీడ్ షాప్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.

