Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Adilabad వరద నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్షేత్రస్థాయి పరిశీలన

వరద నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్షేత్రస్థాయి పరిశీలన

0
54

వరద నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా క్షేత్రస్థాయి రిశీలన

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల్లోని పలు వరద ప్రభావిత ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లను) జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలంలో రహదారులు, నివాస ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా తీసుకోవాల్సిన నివారణ, రక్షణ చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరద నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి వెంబడి నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో డీపీవో రమేష్, డీఎల్పీవో ఫణిందర్, పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, ట్రైబల్ ఈఈ తానాజీ, జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ అధికారి సునీత పాల్గొన్నారు. తహసీల్దార్లు కలిమ్, ఇమ్రాన్ ఖాన్, కవిత, ఎంపీడీఓలు రవీందర్, శేఖర్, డిప్యూటీ ఈఈ రాజేష్, జాతీయ రహదారి విభాగం ప్రతినిధులు శాలిని, సుకుమార్, సోమా నిర్మాణ సంస్థ ప్రతినిధులు,  స్థానిక సర్పంచులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Logo
LIVE
✖ Close హోం
WhatsApp