-Advertisement-

జనాభా లెక్కల సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి

జనాభా లెక్కల సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి

చిత్రం న్యూస్, దండేపల్లి :దండేపల్లి మండలంలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను అధికారులు అత్యంత క్రమబద్ధంగా, ఖచ్చితంగా నిర్వహించాలని తహసీజనాభా లెక్కల సేకరణ పకడ్బందీగా నిర్వహించాలిల్దార్ రోహిత్, ఎంపీడీఓ ప్రసాద్ సూచించారు. జనాభా లెక్కలు ప్రభుత్వానికి కీలకమైన సమాచారంగా ఉపయోగపడతాయని, అందువల్ల ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.

సోమవారం దండేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిగా సేకరించాలని, వయస్సు, విద్య, ఉపాధి వంటి అంశాలను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.

అంతేకాకుండా, సేకరించిన సమాచారాన్ని రికార్డుల్లో సరిగా నమోదు చేయడంతో పాటు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డేటాను సమర్పించాలని సూచించారు. గణనలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని వారు అన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జనాభా లెక్కలు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు పునాది వంటివని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఈ డేటా కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ప్రజలు కూడా సిబ్బందికి సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments