-Advertisement-

మొక్కజొన్న కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేయాలి : డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ డిమాండ్ 

మొక్కజొన్న కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేయాలి : డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ డిమాండ్  

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ ( కె) గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, బాసర మండల అధ్యక్షుడు కోర్వ శ్యాం  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బాసర మండలంలోని ఆయా గ్రామాలలో మొక్కజొన్న పంటను రైతులు విస్తారంగా పండించారని, పంటను అమ్ముకునేందుకు మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు లేక పంటను దళారీ చేతిలో అమ్మి మోసపోతున్నారన్నారు. ఆరుగాలం పంట పండించి పంటను ప్రయివేట్  దళారులకు తక్కువ రేట్లలో అమ్ముకోవాల్సి వస్తుందన్నారు.ప్రభుత్వం తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రైతులతో కలిసి ప్రభుత్వంపై ఆందోళనలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రీనివాస్, గంగాధర్, మంతెన పోశెట్టి, పెద్దకప్ రవి,మలేగాం గోపాల్, అగుల్ల శివన్న, జాజోళ్ల అశోక్, జాజోళ్ల రాజు, నరడి మహేష్, పల్లె రాజేశ్వర్, గుడాల లక్ష్మణ్, యోగేష్, మలేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments