-Advertisement-

టీఎన్జీవో స్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 

టీఎన్జీవో స్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని, నగరంలో పులాంగ్ చౌరస్తాలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆ మహనీయుని కాంస్య విగ్రహానికి టీఎన్జీవో పక్షాన పూలమాలవేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కార్యక్రమాన్ని ఉద్దేశించి సుమన్ కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్: బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ మూడు ముఖ్య సూత్రాలే మన దేశ సర్వతోభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని,… అన్ని రంగాలలో సమానత్వాన్ని పాటించినప్పుడే ఆ మహానుభావునికి ఘనమైన నివాళులు అని, టీఎన్జీవో ఆధ్వర్యంలో కుల,మతాలకు అతీతంగా కార్యక్రమాలు చేపడుతూ.. ఆ మహానుభావునికి ఆదర్శంగా ఉంటు బాబాసాహెబ్ వారసులుగా కొనసాగుతూ వారి ఆశయ సిద్ధికి పాటుపడతామన్నారు. టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో బాబా సాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు నిరంజన్ గౌడ్, స్వామి, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments