చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 23వా వార్డు మహాలక్ష్మి వాడకు చెందిన తోట సుభాష్ తోట గౌరమ్మ దంపతుల కుమారుడు తోట శంకర్ ప్రభుత్వ వైద్యారోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా శంకర్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న వారి నివాసానికి స్వయంగా వెళ్లారు. శంకర్, అతని తల్లిదండ్రులను జోగు రామన్న ఘనంగా సన్మానించారు.శంకర్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పేద కుటుంబం నుండి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




