-Advertisement-

బరంపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయ భక్తుల సౌకర్యార్థం బెంఛీలు విరాళం

చిత్రం న్యూస్, తలమడుగు: బరంపూర్ గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం పల్లి (బి)గ్రామ వాస్తవ్యులు నల్లా రవీందర్ రెడ్డి గొప్ప మనసుతో ముందుకు వచ్చారు. సుమారు రూ. 70 వేల  సొంత  నిధుల ఖర్చుతో ఆలయానికి వచ్చే భక్తులు కూర్చోవడానికి వీలుగా ప్రత్యేక టేబుళ్లను (బెంఛీలను) చేయించారు.ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, బరంపూర్ గ్రామస్తులైన మెరువు ప్రభాకర్ రెడ్డి – శైలజ దంపతుల ఆధ్వర్యంలో నల్లా రవీందర్ రెడ్డి దంపతులను ఆలయ ప్రాంగణంలో శాలువాతో కప్పి చిరు సన్మానం చేశారు. స్వామివారి సేవలో భాగస్వాములైనందుకు గ్రామస్తులు, భక్తులు రవీందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments