-Advertisement-

దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీ ముట్టడి: బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ నేతృత్వంలో భారీ ర్యాలీ

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని దివ్యాంగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అసెంబ్లీ వరకు నిర్వహించిన ఈ భారీ పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారి హక్కుల సాధన కోసం బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాయల్ శంకర్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు రామారావు పాటిల్, హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ, పలు దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments