చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని రైతుల సౌకర్యార్థం 2025-26 సంవత్సరానికి గాను శనగ పంట కొనుగోలు షెడ్యూల్ను మండల వ్యవసాయ అధికారి పూజ విడుదల చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు వివిధ గ్రామాల నుండి కొనుగోళ్లు జరగనున్నాయి. రైతులు తమ పంటను షెడ్యూల్ చేసిన తేదీలలో కొనుగోలు కేంద్రనికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.




