చిత్రం న్యూస్, భీంపూర్: శ్రీరామ నవమిని పురస్క రించుకుని కరంజి-టిలో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు సాగిన భజన పోటీల్లో విజేతగా ఆదిలాబాద్ పట్టణం రవీంద్ర నగర్ భజన బృందం ప్రథమ బహుమతి సాధించి విజేతగా నిలిచింది. తలమడుగు మండలం బరంపూర్ ( ద్వితీయ), న్యూ హౌసింగ్ బోర్డు, ఆదిలాబాద్ ( తృతీయ), దిగ్రస్, మహారాష్ట్ర( నాల్గవ ), సాంగిడి, బేల ( ఐదవ), గుబిడి, భీంపూర్ (ఆరవ ),కరంజి -కే, జైనథ్ (ఏడవ) బహుమతి సాధించారు. విజేతలకు సర్పంచ్ కల్చాప్ యాదవ్, గ్రామ పెద్దలు నరేందర్ యాదవ్, రమేష్, దేవా రెడ్డి, ఉద్దవ్, తదితరులు నగదు బహుమతులు అందజేసి అభినందించారు. జైనథ్ మండలం కరంజి -కే భజన బృందం కళాకారుడు భగవాన్ రెడ్డి ఉత్తమ గాయకుడి బహుమతి గెలుచుకున్నారు. కాగా ఈ పోటీలకు ఆదిలాబాద్, తలమడుగు, జైనథ్, తాంసి, బేల మండలాల భజన బృందాలతో పాటు సరిహద్దు మహారాష్ట్ర గ్రామాల నుంచి 22 భజన బృందాలు పాల్గొన్నాయి. భజన కళాకారులు తమ గానంతో అలరించారు. న్యాయ నిర్ణేతలుగా ఉమేష్, ఆనంద్, రమేష్ యాదవ్ వ్యవహరించారు.



