చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆకుపచ్చ, గులాబీ రంగు చీర, ఆకుపచ్చ జాకెట్ ధరించి ఉందని, మహిళకు సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, మృత దేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే బాసర పోలీస్ స్టేషన్ లో (8712659540) సంప్రదించాలని తెలిపారు.



