చిత్రం న్యూస్, బైంసా : భైంసా పట్టణంలో డాక్టర్ కాశీనాథ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మమతా క్లినిక్ ఆసుపత్రిని ముథోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భైంసా ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆధునిక వైద్య సదుపాయాలు ఎంతో అవసరమని తెలిపారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు దగ్గరలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. మమతా క్లినిక్ వంటి సంస్థలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన అన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం ప్రజల ఆరోగ్యానికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ కాశీనాథ్ మాట్లాడుతూ, మమతా క్లినిక్ ద్వారా ప్రజలకు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వివిధ రకాల వ్యాధులకు చికిత్సతో పాటు, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోళ్ళ దత్తు, వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు, ప్రముఖులు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

