-Advertisement-

MLA PAYAL SHANKAR _ఖైరతాబాద్ గణనాథునికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూజలు

ఖైరతాబాద్ గణనాథునికి ఎమ్మెల్యే పాయల్ శంకర్  పూజలు

చిత్రం న్యూస్, ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన ఖైరతాబాద్ గణనాథునికి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం భారీ గణనాథున్ని ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఎమ్మెల్యేలను శాలువా మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఖైరతాబాద్ గణనాథుడు దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవడం మన హిందూ ధర్మ సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు. యువత హిందూ ధర్మ పరిరక్షణకై ఇలాంటి హైందవ ధర్మ కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుకు రావాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments