మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
చిత్రం న్యూస్, బోథ్ : నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ఐటీ లో సీటు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన మునిమల వెంకటమ్మ కూతురు శైలజ (15) పదో తరగతిలో 563 మార్కులు సాధించి ట్రిబుల్ ఐటీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత నెల జరిగిన కౌన్సిలింగ్ లో సీటు లభించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయింది. ఇదే క్రమంలో పట్టణంలోని అటెండర్స్ కాలనీలో గల తన బాబాయ్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
