కరత్వాడ ప్రాజెక్ట్ నుంచి వృధాగా పోతున్న నీరు
చిత్రం న్యూస్, బోథ్: ఒకవైపు వర్షాలు తక్కువ ఉండడంతో వర్షాకాలం రెండు నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు ప్రాజెక్టులు నిండలేదు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ కరత్వాడ ప్రాజెక్ట్ కుడి వైపు కెనాల్ గేట్ మొరాయించడంతో గత 10 రోజులుగా నీరు వృధాగా పోతుంది. అసలే వర్షాలు లేక చిన్న చిన్న ఒర్రెలలో, వాగులలో చుక్క నీరు కూడా లేదు. రాబోయే రబీ పంటలకి కరత్వాడ ప్రాజెక్ట్ నీరే రైతుల పంటలకు ఆధారం. సంరంక్షించాల్సిన నీటిని ఇలా వృధా చేస్తే కరత్వాడ ప్రాజెక్ట్ లో నీరు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కరువు పరిస్థితులు రాకముందే అధికారులు వృధా నీటిని అరికట్టాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.
