Chitram news
Newspaper Banner
Date of Publish : 03 August 2025, 4:38 pm Editor : Chitram news

సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు

సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పిప్పలదారి గ్రామంలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోడుసం బాబురావు ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ నుంచి పెద్ద మంటలు వ్యాపించాయి . ఇంట్లో ఉన్న సభ్యులు గాయపడ్డారు. తొలుత వారిని బోథ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అదిలాబాద్ రిమ్స్  ఆసుపత్రికి తరలించారు.