Chitram news
Newspaper Banner
Date of Publish : 31 July 2025, 4:57 pm Editor : Chitram news

ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ

ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ముధోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్

చిత్రం న్యూస్,బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో రూ.16 లక్షలతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి ముధోల్ ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఉప కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటానని, ఈ క్రమంలో స్థానిక ప్రజలకు మరింత వేగవంతమైన మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు బాసర మండల కేంద్రంలోని రైతు వేదిక నందు 584 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.