విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్న ట్రస్టు ఛైర్మన్ (విశ్రాంత న్యాయమూర్తి) శ్యామ్ మోహన్ రావు దేశ్ పాండే
చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో వినాయక్ రావ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి ప్రతిభ కనబర్చిన ఆరుగురు విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేశారు. ట్రస్టు చైర్మన్ శ్యామ్ మోహన్ రావు దేశ్ పాండే (విశ్రాంత న్యాయమూర్తి) మనవరాలు శివాని సహకారంతో విద్యార్థులు M.నందిని, K.లక్ష్మి, j.శ్రీనిత, N.రచన, D.విఠల్, R.స్వాతిలకు ఒక్కొక్కరికీ రూ.8 వేల చొప్పున విద్యార్థులకు ఉపకార వేతనాలను ఆయన అందజేశారు. ఆయన మాట్లాడుతూ..గత 22 సంవత్సరాల నుండి పదోతరగతి లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని ట్రస్ట్ చైర్మన్ శ్రీ శ్యామ్ మోహన్ రావు దేశ్ పాండే తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ వామన్ రావు దేశ్ పాండే, ,సెక్రటరీ అంబదాస్, ట్రస్ట్ సభ్యులు, న్యాయవాదులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు . అనంతరం బోథ్ గ్రామస్తులు ట్రస్ట్ చైర్మన్ శ్రీ శ్యామ్ మోహన్ రావు దేశ్ పాండే ను సన్మానించారు.
