ఘనంగా న్యాయ దినోత్సవం
చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ మండల కేంద్రంలోని వాగ్దేవి జూనియర్, డిగ్రీ కళాశాలలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో న్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది కుమ్మరి విజయ్ కుమార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయాన్ని గెలిపించడానికే చట్టాలు ఉన్నాయని అన్నారు. చట్టాలను ప్రతిఒక్కరు తెలుసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం న్యాయవాది విజయ్ కుమార్ ను కళాశాల యాజమాన్య, అధ్యాపక బృందం, విద్యార్థులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాజశేఖర్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్, యాజమాన్య సభ్యులు కుమ్మరి పోశెట్టి, ప్రవీణ్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు
