*ప్రపంచ రికార్డ్ సాధించేలా 5 లక్షల మందితో యోగాసనాలు
*ఆర్కే బీచ్ వేదికగా యోగా డే కార్యక్రమ నిర్వహణపై సీఎం అత్యున్నత స్థాయి సమీక్క్ష
*క్షేత్ర స్థాయిలో యోగా డే నిర్వహణ సన్నద్ధతను సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
చిత్రం న్యూస్,విశాఖపట్టణం: ఈ నెల 21వ తేదీన విశాఖలో తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్ నుంచి రుషికొండ సమీపంలోని గీతం యూనివర్సిటీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అనంతరం ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ మైదానంలో చేసిన ఏర్పాట్లనూ సీఎం పరిశీలించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఏ విధంగా చేస్తున్నారనే అంశంపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి సూచనలు తీసుకున్నారు. యోగా డే ను ప్రపంచ రికార్డు సాధించేలా నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై దిశా నిర్దేశం చేశారు.