-Advertisement-

భీంసరి వంతెన నిర్మాణానికి భూమిపూజ.. అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

భీంసరి వంతెన నిర్మాణానికి భూమిపూజ.. అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు: ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి  గ్రామ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న  గ్రామ వంతెన నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ రూ.3 కోట్ల వ్యయంతో భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత పాలకులు కేవలం మాటలకే పరిమితమై అభివృద్ధిని విస్మరించారని ఆయన విమర్శించారు. తాము చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ అభివృద్ధిని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  భీంసరి గ్రామ సర్పంచ్ గౌరు కార్తీక్, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments